Sunday, September 18, 2011

ఆప్తులంటే.. వీళ్ళు!

విజయవాడలో నవోదయలో అడుగుపెడుతుండగానే.. మీకు కోత్త ప్రపంచాన్ని ఇచ్చిన మనిషి వెళ్ళిపొయాక వచ్చారేం అన్నారు రామ్మోహనరావుగారు. సుప్తభుజంగాలు నవల ముందు మాట రాస్తూ..బండెడు చెత్తలొ ఒక మాణిక్యం మెరిస్తే ఎలా వుంటుందీ..? కళ్ళు జిగేల్ మనవూ.. బురద మడుగులో ఒక పద్మం విరిస్తే ఎలా వుంటుందీ..? మనసు పరవశించదూ. అటువంటి అరుదైన మాణిక్యాల్లో, పద్మాల్లో ఒకటి సుజాత సుప్తభుజాంగలు. ఈ నవల, రచయిత్రి మొదటి నవల కావటం విశేషం.. అంటూ సాహితీ ప్రపంచానికి నన్ను పరిచయం చేసి, నా ఉద్యొగ జీవితానికి రహదారి వేసిన నండూరిగారు కనబడకుండా పొతే ఏం మట్లాడటం.. ఇంకాస్త ముందెళ్ళిపొయిన మహీధర రామ్మోహనరావుగారు, యేటుకూరి బలరామమూర్తిగారు, ఇప్పటికి విజయవాడ నుంచి పలకరించే పరకల పట్టాభిరామారావుగరు కంకణం కట్టుకొని నా వునికి ప్రపంచానికి యెలా చాటారో.. తలో చేయివేసి ఎలా ముందు నిల్చోబెట్టారో.. ఎంత చెప్పాలి..? యే బాంధవ్యంతో అంటే.. సరిగ్గా.. మనిషికి మనిషికీ వుండవలసిన అనుబంధంతో. కాసేపు పుస్తకాల వంకా, కాసేపు రొడ్డువైపు దిక్కులు చూస్తూ కూర్చుంటే.. నేనింకో పదేళ్ళు పర్లేదా.. అన్నారు రామ్మోహనరావుగారు. ఆ ఓదార్పుకి ఏం మాట్లాడాలి..? పొయినోళ్ళు అందరూ మంచొళ్ళు.. ఉన్నొళ్ళు పొయినొళ్ళ తీపిగుర్తులు.

1 వ్యాఖ్యలు:

putta sreedhar said...

sujatamma gari ki good morning.mee apthulante velle ...ippude chadivaanu.andulu mee bangaram lanti mansau kanipinchindi....plastic navvula prapanchamlo poddunne oka manchi manasu nu chusanu....meeru manchi writer antha kanna manchi manasunna amma...meelante aptulu maku dorakatam maku devudichhina varam